లేడీ కాదు కిలేడీ.. పదుల సంఖ్యలో యువకులు... వేధింపులు తాళలేక, యువకుడు..
ఆమె తేనేపూసిన కత్తి.. కమ్మని మాటలు చెప్పి బుట్టలో పడేస్తోంది. మీరు ఆమె మాయలో పడ్డారో ఇక అంతే సంగతులు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీరు నమ్మిన నమ్మకపోయిన ఇది నిజం. మాయా లేడీ వలలో పడ్డ 21 మంది యువకులు నరకం అనుభవించారు. ఆమె వేధింపులు తాళలేకపోయారు. ఆమె హరాస్మెంట్ పగవాడికి కూడా రావొద్దంటున్నారు.
హైదరాబాద్కు చెందిన సుల్తానా నిజామీ అనే యువతి చుక్కలు చూపిస్తోంది. సాధారణంగా యువతలను అబ్బాయిలు ట్రాప్ చేస్తారు. ప్రేమ పేరుతో మోసం చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. సుల్తానా నిజామీ కళ్లల్లోంచి ఏ యువకుడు తప్పించుకోలేడు. ఆమెకు చిక్కిన యువకుడు తప్పించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఆమె వలల్లో చిక్కి చిత్రవధ అనుభవించారు. ఆ నరకాన్ని అనుభవించలేక ఏకంగా పోలీసులను ఆశ్రయించారు.
సుల్తానా నిజామీపై దాదాపు 21 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఇవాళ మరో యువకుడు ఏకంగా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సుల్తాన్ నిజామీ వేధింపులు భరించలేనని చెప్పి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఎందుకు బలవన్మరణానికి ప్రయత్నించావని ప్రశ్నిస్తే.. అతని నోట నిజామీ పేరు వచ్చింది. యువకులను వేధిస్తోన్న నిజామీపై పోలీసులు దృష్టిసారించారు. కేసు ఆధారంగా సుల్తానా నిజామీని పోలీసులు అరెస్ట్ చేశారు.