యురేనియం తవ్వకాల ఉపసంహసంహరణపై ఏకగ్రీవ తీర్మాణం చేసిన తెలంగాణ అసెంబ్లీ
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటిఆర్ తీర్మాణం ప్రవేశపెట్టారు. దీంతో సభ మొత్తం తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.కాగా అంతకు ముందే సీఎం కేసిఆర్ యురేనియం తవ్వకాలను ఆనుమతి ఇవ్వమని సీఎం కేసిఆర్ సైతం సభలో ప్రకటించారు.
చిన్మయానంద కేసు : కోర్టుకు హజరైన యూపీ లా విద్యార్థిని
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై గత కొద్ది రోజులు,పర్యవరణ వేత్తలతోపాటు సామాజిక వేత్తలు, ఇతర రాజకీయ పార్టీల నుండి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్రం నిర్వహిస్తున్న తవ్వకాలపై ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ముందుకు వచ్చింది. యురేనియం తవ్వకాలతో తెలంగాణకు ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం కేసిఆర్ వీటివల్ల కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయని సభలో వ్యాఖ్యానించారు. దీంతో యురేనియం తవ్వకాలను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
యురేనియం అనుమతులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని,తెలంగాణ ప్రభుత్వం ఎలాంటీ అనుమతులు ఇవ్వలేదని ,దీంతో పాటు భవిష్యత్లో కూడ అనుమతులు ఇవ్వాలనే ఆలోచన ఏది లేదని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్కు తాగునీరు అందించే క్రిష్ణాజలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తవ్వకాలను అనుమతి ఇవ్వమని చెప్పిన సీఎం కేంద్రం ప్రజల అభిప్రాయాలను కాదని ముందుకు వెళితే అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు.