2019-20కి రూ.1,45,492 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్: ఆదివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఈరోజు తొలిసారిగా పూర్తిస్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ఆర్థికశాఖ మంత్రిగా హరీష్ రావు కేసీఆర్ కేబినెట్లో చేరడంతో ఆయన తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ను శాసనమండలిలో హరీష్ రావు ప్రవేశపెట్టనుండగా... శాసనసభలో మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అది ఆరునెలలకే పరిమితం కావడంతో ఈ సారి బడ్జెట్ పూర్తిస్తాయిలో ప్రవేశపెట్టారు.
ఆర్థికశాఖ మంత్రి వచ్చాక కూడా సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై ఒక్కింత ఆసక్తి నెలకొనడమే కాదు.. రాజకీయవర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో ఆర్థికమాంద్యం నెలకొనడంతో వాస్తవాలకు దగ్గరగా ఈసారి బడ్జెట్ ఉండబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గినట్లు సమాచారం. వ్యవసాయ రంగం, సంక్షేమం,నీటిపారుదలకు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరపనున్నట్లు సమాచారం.