ఢిల్లీలో కేసీఆర్.. సాయంత్రం ప్రధానితో భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రధాని మోడీతో భేటీకానున్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీని కలవడం ఇదే మొదటిసారి కానుంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా మోడీని కలవబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్.. సాయంత్రం 4 గంటలకు ఆయనతో సమావేశం కానున్నారు. విభజన హామీలతో పాటు ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి త్వరగా గెజిట్ విడుదల చేయాలని కోరనున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అంశాలపై మోడీతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటయినందున.. ఇక్కడి సచివాలయంలో వారికి కేటాయించిన వివిధ కార్యాలయాలను తిరిగి తమకు అప్పగించేలా చర్చలు తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం.
ఆ పదవిపై పెదవి విరుపు..! నువ్విస్తానంటే నేనొద్దంటున్నా..! తెలంగాణ సర్కార్ లో నయా ట్విస్ట్
తెలంగాణకు కొత్త సెక్రటేరియట్, రాజీవ్ రహదారి విస్తరణకు డిఫెన్స్ భూములు అప్పగించే అంశాలు ప్రస్తావిస్తారనే టాక్ వినిపిస్తోంది. రిజర్వేషన్ల పెంపుపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.