ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు... చివరకు ఏం చేశాడో తెలుసా...?
హైదరాబాద్లోని చైతన్యపురి ప్రాంతంలో మరో దారుణం జరిగింది. తన ప్రియురాలిని గోంతు కోసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు ప్రియుడు. అనంతరం తాను కూడ గోంతుకోసుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
ప్రియురాలి గోంతు కోసిన ప్రియుడు
హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉన్న బృందావన్ లాడ్జ్లో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్, హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన యువతి మనస్వినితో గత కొద్ది రోజులుగా ప్రేమాయాణం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో మాట్లేడేందుకు మనస్వీని బృందావన్ లాడ్జ్కు తీసుకుని వచ్చాడు. లాడ్జ్లో ఇద్దరి మధ్య వాగ్వావాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మనస్విని గోంతు కోశాడు. దీంతో ఆమే ఆర్తనాదాలు చేయండంతో లాడ్జ్ సిబ్బంది హుటాహుటిన వారు ఉన్న గదికి చేరుకుని మనస్విని ఆసుపత్రికి తరలించారు.
భయపడి తాను సైతం గోంతుకోసుకుని ఆత్మహత్యా యత్నం
అంతకు ముందే వెంకటేశ్ వ్వవహారంతో భయపడి పోయిన మనస్విని జరిగిన విషయాన్ని వాట్సాప్లో తన తల్లిదండ్రులకు తెలిపడంతో పాటు లోకేషన్ను షేర్చేసింది. దీంతో బడంగ్ పేట్లో ఉంటున్న మనస్విని తల్లిదండ్రులు హుటాహుటిన హోటల్కు చేరుకున్నారు. అయితే వారిని చూసిన వెంకటేష్ భయంతో తాను కూడ బాత్రూంలోకి వెళ్లి గోంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. దీంతో ఇద్దరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పోందుతున్న మనస్విని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న వెంకటేశ్, మనస్వినిలు
దిల్షుక్నగర్లో బ్యాంకింగ్ ఉద్యోగంలో భాగంగా కోచింగ్ తీసుకునేందుకు వెంకటేష్తో పాటు మనస్విని పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని భావిస్తున్నారు. అయితే ముందు బాగానే రానురాను వెంకటేష్తో విభేధించడంతో కక్ష్య పెంచుకుని మనస్వినిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. దీంతో విషయాన్ని వెంకటేష్ తల్లిదండ్రులకు కూడ సమాచారం అందించారు.