స్వంత తండ్రి కారు క్రిందే పడి ప్రాణాలు విడిచిన 20 నెలల బాలుడు
హైద్రబాద్ ; విధి వక్రికరించిందో ఏమో... లేక తాను ఇక ఉండను అనుకున్నాడో ఏమో... ఓ చిన్నారి 20 నెలలకే తనువు చాలించాడు....తన తండ్రి కారు క్రిందే పడి ప్రాణాలు విడిచాడు...ఈ సంఘటన హైద్రబాద్ లోని మీర్ పేట్ లో జరిగింది...
తల్లి లేదా తండ్రి బయటకు పోతుంటే ఎంతటి పిల్లలు బయటకు వచ్చి భాయ్ .. చెబుతారు.. మరి చిన్న పిల్లలైతే అల్లరి చేస్తారు ,తమతో బయటకు వస్తామని గోల పెడతారు. తాము మళ్లి వస్తామన్న వెళ్లనివ్వరు..మరికోంతమందైతే వెంట రోడ్డు వరకు వస్తారు..తల్లి దండ్రులకు తెలియకుండానే ముందే వచ్చి ఎదురుగా నిలబడతారు...
అలాగే 20 నెలల చిన్నారి గౌతమ్ తన తండ్రి క్రిష్ణతో చాల సేపు ఇంట్లో గడిపాడు ,క్రిష్ణ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగానికి వెళ్లేందుకు సన్నద్దమయ్యాడు..దీంతో ఇది గమనించిన గౌతమ్ తండ్రి వెనకాలే వచ్చి , కారు వెనకాల నిలబడ్డాడు.. ..అయితే డ్రైవర్ క్రిష్ణ అఫీసుకు పోయో తోందరలో కారు వెనకాల ఉన్న కుమారున్ని గమనించలేదు ..దీంతో కారును రివర్స్ తీసుకుని తాను ఆఫీసుకు వెళ్లిపోయాడు...అయితే కారు వెనకాలే గౌతమ్ ను గమనించకపోవడంతో ,గౌతమ్ కారు వెనకాల నలిగిపోయాడు..
ఇక ఎంత సేపటికి తన బిడ్డరాలేదని తల్లి జ్యోతి బయటకు వచ్చి చూసింది..అపస్మారక స్థితిలో ఉన్న కొడుకు చూసి లబోదిబోమంది.. అపస్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది ..అయినా ఫలితం దక్కలేదు..చికిత్స పోందుతూ గౌతమ్ ప్రాణాలు విడిచాడు..కాగా ..రెండు రోజుల క్రితం హైద్రబాద్ నగరంలో కరెంట్ షాక్ తో 6 సంవత్సరాల అబ్బాయి చనిపోయిన సంగతి మరవకముందే మరో చిన్నారి అనుహ్యంగా ప్రాణాలు కోల్పోవడం అందరిని బాధిస్తోంది...