బాంబు పేలుళ్లలో.... హైదరాబాద్ ఆర్మీ డాక్టర్....! పోలీసుల అరెస్ట్
హైదరాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో డాక్టర్గా పని చేస్తున్న వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆర్మీ డాక్టర్కు యూపీలోని ఖుషినగర్లో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్మీ డాక్టర్ను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
మరోసారి హైదరాబాద్ తీవ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారింది. దేశంలో ఎక్కడ తీవ్రవాద సంఘటనలు జరిగినా...దాని మూలలు హైదరాబాద్ లో ఉంటున్నాయనే ఆరోపణలకు ఊతం ఇస్తూ... మరో సంఘటన వెలుగుచూసింది. ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ ఆర్మీ కెప్టెన్ను అశ్వక్ అనే డాక్టర్ మసీదులో బాంబు పెలుళ్లలో హస్తం ఉందని పోలీసులు అనుమానించి కేసు నమోదు చేశారు. కాగా బాంబు పేలుళ్లు జరిగినప్పుడు డాక్టర్ అశ్వక్ యూపీలోనే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగ సాక్షులను తారుమారు చేసేందుకు అశ్వక్ ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు ఆరోపణలు చేశారు.
ఇటివల ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్లోని బైరాగి పట్టి గ్రామంలో గల మసీదులో బాంబు పేలుడు జరిగింది. అయితే పేలుళ్లలో ఎలాంటీ ప్రాణనష్టం జరగలేదు. కాగా తక్కువ ప్రభావంతో కూడిన పేలుళ్లు జరిగాయని ఫోరెన్సిక్ రిపోర్ట్లో పేర్కోన్నారు. కాగా పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే ఏడుగురుపై కేసులు నమోదు చేశారు. వీరిలో మసీదు ఇమామ్తో పాటు నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.