ఆ ముగ్గురు ఉంటే పార్టీలో ఎవరు మిగలరు...రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఞంచార్జ్ కుంతియాతోపాటు, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కు లు ఉంటే పార్టీలో ఎవరు మిగలరని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్సుడిని మార్చి ఉంటే పది పార్లమెంట్ సీట్లు వచ్చేవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తాను తీసుకుబోయో నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి వచ్చిన హైదరాబాద్ అంబర్ పేట్ లోని ఓ కార్యక్రమంలో పాల్గోన్నఅనంతరం కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పార్టీ సమావేశంలో కార్యకర్తలు ఆయనపై మండిపడ్డారు. వారిని స్టేజిపైకి పిలిచినా రాకుండా పలువురు సీనీయర్ నాయకులు సమావేశం నుండి వెళ్లి పోయారు.ఈనేపథ్యంలోనే పార్టీ నాయకత్వం బాగాలేదని అన్నారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఉండేదని అయితే కుంతియా లాంటీ వాళ్లు వ్యతిరేకించారని అన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీతో పోత్తు పెట్టుకోవడం వల్లే పార్టీ ఓటమీ పాలు అయిందని చెప్పుకోచ్చారు.ఎన్నికల్లో సరిగా టికెట్లు ఇవ్వకపోవడం..తోపాటు ఎన్నికల్లో నాయకులు డబ్బులు తీసుకుని బాగుపడ్డారని ఫైర్ అయ్యారు. పార్టీ నేతలంతా ఉత్తమ్ ను మార్చాలని కోరుతున్నారని అన్నారు. ఇప్పటికైన అధిష్టానం కళ్లు తెరవాలని అన్నారు. లేదంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందని మరోసారి చెప్పారు. ఇక పార్టీ మారుతున్న నేపథ్యంలో తన రాని వారిని తప్పు పట్టనని , బలవంతంగా తనతోపాటు తీసుకెళ్లనని చెప్పారు.