ఆస్పత్రిలో లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ.. బీ-నెగటివ్ దాతలకు ఫ్యామిలీ రిక్వెస్ట్
ప్రముఖ రచయిత, టాలీవుడ్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ(66) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు. గురువారం నాటికి ఆయన పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు.. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. అయితే..
సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ బీ-నెగటివ్ కావడం, లాక్ డౌన్ కారణంగా ఆసుపత్రిలో రక్తం నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఆయన కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. రక్త దాతలు ఎవరైనా ఉంటే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిని సంప్రదించొచ్చని లేదా 8985038016 నంబర్కు ఫోన్ చేయాలని సుద్దాల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అభ్యర్థించారు.
Recommended Video
సొంత ఊరు సుద్దాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న అశోక్ తేజ.. 'నమస్తే అన్న' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సినీ నటుడు ఉత్తేజ్కి సుద్దాల మేనమామ. తనికెళ్ళ భరణి తదితుల ప్రోత్సాహంతో సినీ రంగంలో రాణించిన సుద్దాల.. ఠాగూర్ సినిమాకుగానూ జాతీయ అవార్డు కూడా పొందారు. ఎన్నో అద్భుతమైన గేయాలతో అలరించిన ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.