29 కి.మీ 22 నిమిషాల్లో...! గుండేను ట్రాన్స్పోర్ట్ చేసిన పోలీసులు
మరోసారి గ్రీన్ చానల్ ద్వార గుండేను సక్సెస్ఫుల్గా గమ్య స్థానానికి చేర్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, 29 కిలోమీటర్ల గమ్యస్థానాన్ని కేవలం 22 నిమిషాల్లోనే గ్రీన్ చానల్ ద్వార చేర్చారు. గ్లోబల్ ఆసుపత్రి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అంబులెన్స్ ద్వార గుండెను తరలించారు.
మధ్యహ్నాం 12.37 నిమిషాలకు సైఫాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రి నుండి వైద్యుల బృందం గుండేను తీసుకుని శంశాబాద్కు బయలుదేరారు. అనంతరం 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంశాబాద్ ఎయిర్పోర్టుకు 12.59 నిమిషాలకు చేరుకున్నారు. దీంతో మొత్తం 29 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లోనే చేరుకునే విధంగా ట్రాఫిక్ నియంత్రణ చేశారు. ఇందుకు సంబంధించి అడిషనల్ ట్రాఫిక్ కమీషనర్ అనిల్ కుమార్ తగిన ఏర్పాట్లను చేశారు.. అటు హైదరాబాద్తోపాటు, సైబారాబాద్ పోలీసు వ్యవస్థను కూడ మానిటర్ చేసినట్టు తెలిపారు.
గత కొద్ది రోజులుగా అత్యవసర శస్త్ర్రచికిత్సలతోపాటు శరీర అవయవాలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ అనే వ్యవస్థను తీసుకువచ్చారు..అప్పటి నుండి పలుసార్లు గ్రీన్ చానల్ ద్వార అవయవాలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.