పరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావు
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో తన బాధను వ్యక్తం చేశారు.
ఆ ఘనత కేసీఆర్దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్
పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమన్నారు హరీశ్ రావు. పిల్లల ఆత్మహత్యల వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని.. ప్రాణాలు పోతే తిరిగిరావన్నారు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.
మరో ట్వీట్ చేస్తూ.. పసిపిల్లలను వత్తిడికి గురిచేయొద్దని సూచించారు. అలాంటి చర్యలు మంచిది కాదని.. తల్లిదండ్రులకు టీచర్లను కోరారు. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందామన్నారు.