హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కవితకు టీఆర్ఎస్ క్రీయాశీల సభ్యత్వం.. ఇంటికెళ్లి రసీదు అందించిన మంత్రి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరందుకుంది. పల్లెల నుంచి నగరాల దాకా పార్టీ నేతలు సభ్యత్వ నమోదులో బిజీబిజీగా ఉన్నారు. ఆ క్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీయాశీల సభ్యత్వం నమోదు చేశారు. నగరంలోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న కవిత నివాసానికి వెళ్లి రసీదు అందించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల అలాగే సీఎం కేసీఆర్ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. దాన్ని రుజువు చేస్తూ సభ్యత్వం తీసుకోవడానికి పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు.

trs party membership to nizamabad ex mp kavitha

మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!

పార్టీ పెద్దలు నిర్దేశించిన లక్ష్యానికంటే ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు జరుగుతోందన్నారు మంత్రి. తెలంగాణ హక్కులు కాపాడటం.. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడం.. ప్రజాప్రయోజనాలు నెరవేర్చడం.. ఇవన్నీ కూడ టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్ముతూ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారని చెప్పారు.

English summary
TRS Minister Vemula Prashanth Reddy Given party membership to Nizamabad Ex MP Kalvakuntla Kavitha in her residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X