హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి శ్రావణి ట్రయాంగిల్ కథ..రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్,లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మౌనరాగం, మనసు మమత సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏపీ నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డి పంజాగుట్ట పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా పరీక్షల నిమిత్తం నిందితుడిని ఎస్సార్ నగర్ పీహెచ్సీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు..లొంగిపోయిన దేవరాజ్.. నేడు సాయికృష్ణారెడ్డి విచారణసీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు..లొంగిపోయిన దేవరాజ్.. నేడు సాయికృష్ణారెడ్డి విచారణ

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని శ్రావణితో అశోక్ రెడ్డి స్నేహం

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని శ్రావణితో అశోక్ రెడ్డి స్నేహం

శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఏ 1 గా దేవరాజు రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణ రెడ్డి ల పేర్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఏ 3 గా ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు ఉంది. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నటి శ్రావణి, అశోక్ రెడ్డి ఫోన్ సంభాషణలు గుర్తించిన పోలీసులు , శ్రావణితో అశోక్ రెడ్డికి గల సంబంధంపై కూడా దర్యాప్తు చేశారు.సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని శ్రావణి తో అశోక్ రెడ్డి పరిచయం పెంచుకున్న ట్లుగా పోలీసులు గుర్తించారు.

 పరారీలో ఉన్నఅశోక్ రెడ్డి పంజాగుట్ట పోలీసుల ముందు లొంగుబాటు

పరారీలో ఉన్నఅశోక్ రెడ్డి పంజాగుట్ట పోలీసుల ముందు లొంగుబాటు

ఈ క్రమంలో అశోక్ రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు పంపిన పోలీసులకు ,విచారణకు వస్తానని చెప్పి అశోక్ రెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి పోలీసులు అశోక్ రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డి పంజాగుట్ట పోలీసులు ఎదుట లొంగిపోగా , అతడిని విచారించిన పోలీసులు నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

శ్రావణి సూసైడ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ లోనూ ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్ట్ లో ఏ1 గా దేవరాజు రెడ్డి, ఏ2 గా సాయి కృష్ణ రెడ్డి , ఏ3 గా అశోక్ రెడ్డి పేర్లు పోలీసులు చేర్చారు.

రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ .. మొన్నమీడియా ముందు ఒకలా .. రిపోర్ట్ లో మరోలా ..

రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ .. మొన్నమీడియా ముందు ఒకలా .. రిపోర్ట్ లో మరోలా ..

అయితే మొన్న మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఏ3 గా దేవ రాజ్ రెడ్డి పేరు వెల్లడించిన పోలీసులు తాజాగా అతనిని ఏ 1 గా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించి నట్లు తెలిపిన పోలీసులు, దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిలు శ్రావణికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి అశోక్ రెడ్డి, టిక్ టాక్ పరిచయంతో ప్రేమలోకి దింపి దేవరాజ్ రెడ్డి , ఇక 2015లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో సాయికృష్ణా రెడ్డిలతో శ్రావణి కి సంబంధం ఉంది.

Recommended Video

Telangana : సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారు.. - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి!
శ్రావణి కేసు .. ట్రయాంగిల్ కథలో ఆసక్తికర అంశాలు

శ్రావణి కేసు .. ట్రయాంగిల్ కథలో ఆసక్తికర అంశాలు

ఈ ముగ్గురి వేధింపులు భరించలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. శ్రావణి కేసుకు సంబంధించిన ట్రయాంగిల్ కథలో ఆసక్తికరమైన అనేక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దేవ్ రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రావణిని ఆమెకు సాయి కృష్ణా రెడ్డి , అశోక్ రెడ్డిలతో సంబంధం ఉన్న కారణంగా దేవ్ రాజ్ పెళ్ళికి నిరాకరించారు . అదే సమయంలో సాయి కృష్ణా రెడ్డి వేధింపులు కూడా ఎక్కువ కావటంతో శ్రావణి సూసైడ్ చేసుకుంది .

English summary
RX 100 producer Ashok Reddy, who is involved in the actress Shravan suicide case, has surrendered before the police. Ashok Reddy, the accused in the murder case of TV actress Sravani, has reportedly surrendered before the Panjagutta police. The accused is currently being shifted to SR Nagar PHC for corona test. The accused will be produced in court by the police after a medical test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X