హైదరాబాద్ మోడల్ రేప్ కేసులో ట్విస్ట్ : బ్లాక్మెయిలింగ్ అంటున్న నిందితుడి తల్లి
ఆలస్యంగా వెలుగుచూసిన హైదరాబాద్ మోడల్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. డబ్బుల కోసమే ఆ యువతి డ్రామాలు ఆడుతోందని నిందితుడి తల్లి ఆరోపించింది. చనిపోతున్నానంటూ మెసేజ్ చేస్తే.. ఆమెను కాపాడేందుకే తమ పిల్లలు వెళ్లారని, అంతే తప్ప ఆమెపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని తాజాగా వెల్లడించింది. మంచి చేయాలని వెళ్తే రివర్స్లో వారి పైనే కేసులు పెట్టించి వేధిస్తోందని ఆరోపించింది.
నిందితుడి తల్లి ఆరోపణలు :
గత నెల 28వ తేదీన తన కుమారుడి సెల్ఫోన్కు ఆ యువతి సూసైడ్ చేసుకుంటానని మెసేజ్ చేసినట్టు నిందితుడి తల్లి తెలిపింది. తనకు బతకాలని లేదని, తన చావు విషయం తన తల్లికి చెప్పాలని అందులో పేర్కొన్నట్టు వెల్లడించింది. ఆ మెసేజ్ చూడగానే.. తన కుమారుడు, అతని స్నేహితుడిని తీసుకుని అక్కడికి వెళ్లాడని చెప్పింది. వెళ్లేసరికి ఆ అమ్మాయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించిందని, ఆమెను వారించడం వారి వల్ల కాలేదని తెలిపింది.
పోలీసులకు ఫోన్ చేస్తే.. :
ఏం
చేయాలో
తెలియక
ఆ
ఇద్దరు
పోలీసులకు
ఫోన్
చేశారని..
పోలీసులు
వచ్చి
వారిని
స్టేషన్కు
తీసుకెళ్లారని
తెలిపింది.
తీరా
పోలీస్
స్టేషన్కు
వెళ్లాక
ఆ
యువతి
రివర్స్లో
వీరి
పైనే
ఆరోపణలు
చేసినట్టు
చెప్పింది.
తనను
ప్రేమించి
మోసం
చేశారని,తనపై
అత్యాచారానికి
పాల్పడ్డారని
వారిపై
ఫిర్యాదు
చేసినట్టు
తెలిపింది.
రూ.20లక్షల కోసమే :
ఆ యువతి చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. డబ్బుల కోసమే ఇదంతా చేస్తోందని నిందితుడి తల్లి ఆరోపించింది. తనకు రూ.20లక్షలు ఇవ్వాలని,లేకపోతే పోలీస్ కేసు పెడుతానంటూ కొంతకాలంగా బెదిరిస్తోందని ఆరోపించింది. కాగా,సెల్ఫోన్ సంభాషణల ఆధారంగా కేసును చేధించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇందుకోసం ఇరువురి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.
అసలేం జరిగింది..
మోడలింగ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చిన బాధిత యువతి(21) హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉండేది. మోడలింగ్లో పలు పోటీల్లో పాల్గొని టైటిల్స్ కూడా సాధించింది. ఇదే క్రమంలో లేడీస్ హాస్టల్ యజమాని కుమారుడితో ఆమెకు పరిచయమైంది. హాస్టల్ నుంచి జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంటుకు మారిపోయాక కూడా ఆ పరిచయం కొనసాగుతూ వచ్చింది.
అపార్ట్మెంటుకు వెళ్లాక..
ఇదే క్రమంలో గత నెల 28వ తేదీన అతను తన స్నేహితుడితో కలిసి ఆమె ఉంటున్న అపార్ట్మెంటుకు వెళ్లాడు. ఇద్దరు మద్యం సేవించి ఉండంతో అక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పింది. అయితే ఫుడ్ తిని వెళ్లిపోతామని చెప్పడంతో లోపలికి రానిచ్చింది. లోపలికి వెళ్లాక.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు,ఆ తతంగాన్ని వీడియో తీసి.. ఎవరికైనా చెబితే దాన్ని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించారు.
కొనసాగుతున్న దర్యాప్తు :
జరిగిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా మొదట వారు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో మీడియాను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. అనంతరం బంజారాహిల్స్ పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.