ముహూర్తం ఖరారు..! ఆ రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీ సర్కార్..!
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షల నుండి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక రవాణా, భవన నిర్మాణాలు, మద్యం షాపులు, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్లు, సిమెంటు, హార్డు వేర్ షాపులకు అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అంశానికి కూడా వెసులుబాటు కల్పించింది.
కేసీఆర్ మనసు ఫతేమైదానమంత విశాలం..! క్లిష్ట సమయంలో కూడా పాతిక వేల సాయం..!!
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో దాదాపు సాధారణ జీవితం మొదలైనట్టుగా ప్రజలు స్వేచ్చా జీవితాన్ని గడిపేస్తూ రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం నుంచి మరో ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దాంతో మరిన్ని వాహనాలు రెడ్డెక్కే సంకేతాలు స్పష్టంగా కపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కీలకం కాబోతోంది.
దాదాపు నెలన్నరగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్లో స్లాట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య గురువారం సాయంత్రానికి భారీగా పెరిగినట్టు కూడా తెలుస్తోంది. ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1640 స్లాట్స్ బుక్ అయ్యాయి.
వీరంతా శుక్రవారం అందుబాటులో వున్న వాహనాల రిజిస్ట్రేషన్ స్లాట్లను బుక్ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్లాట్స్ బుక్ చేసుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ట్రాన్స్పోర్టు కార్యాలయాల ఖాళీ స్థలాలను బట్టి బుకింగ్ దారులకు ఆహ్వానం పంపుతున్నారు అధికారులు. పూర్తి భౌతిక దూరంతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు.