వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!
హైదరాబాద్ : కాదేదీ కవితకు అనర్హమన్నట్లుగా.. సృజనాత్మకతకు లేదు లోటు అని నిరూపిస్తున్నారు కొందరు. సమయ సందర్భాలను బట్టి తమలోని భావుకతను ప్రదర్శిస్తున్నారు. మోడీపై అభిమానంతో.. కానుకలొద్దు, బీజేపీకి ఓటేస్తే చాలంటూ ఇటీవల వెడ్డింగ్ ఇన్విటేషన్లు దర్శనమిచ్చాయి. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ ప్రజాస్వామ్యంపై మక్కువతో ముద్రించిన ఓట్ల పండుగ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"సాధారణ ఎన్నికలు - 2019.. పార్లమెంట్ నూతన సభ్యుల ఎన్నిక ఉత్సవం" అంటూ ముద్రించిన ఈ పత్రికలో పోలింగ్ తేదీ, సమయాన్ని సుముహుర్తంగా పేర్కొన్నారు. ఓటర్ల నివాస ప్రాంతంలోని పోలింగే కేంద్రాలను వేదికగా ముద్రించారు.
ఈ ఎన్నికల ఉత్సవానికి సంబంధించి ఎలాంటి కానుకలు ఇవ్వరాదు, తీసుకోరాదంటూ విన్నవించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ ఆశీస్సులు అందించాలని కోరారు.