తెలంగాణలో వెలుగులు నింపాలనుకున్నాం.!కానీ టీఆర్ఎస్ పార్టీ కారు చీకట్లు నింపిందన్న ఉత్తమ్.!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట కార్యక్రమం రసాబసగా మారింది. ఏ ఒక్క కాంగ్రెస్ నేతను కూడా ప్రాజెక్టుల దరిదాపులకు వెళ్లనీయకుండా పోలీసులు గృహనిర్బంధానికి పాల్పడ్డారు. గోదావరి నదిపై కాంగ్రెస్ పార్టీ జమానాలో తలపెట్టిన ప్రాజెక్టుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, టీఆఎస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యూహ రచన చేసింది. టీపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి పిలుపు మేరకు ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకల మీద ఒక రోజు జల దీక్ష చేయాలని టీ కాంగ్రెస్ భావించింది. దీక్షకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ్ ఇంటివద్ద మరోసారి ఉద్రిక్తత.!కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్న గులాబీ పార్టీ.!
" title="{photo-feature}" />{photo-feature}