coronavirus: లుంగి, బనియన్ మీద ల్యాప్ట్యాప్తో కుస్తీ, వంటతోపాటు ఆఫీసు పని..
కరోనా వైరస్ దెబ్బకు కార్యాలయాలకు తాళం పడ్డాయి. అన్ని విభాగాల ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని కంపెనీలు కోరాయి. నాలుగైదు రోజుల నుంచి ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. అయితే ఇంటినుంచి పనిచేసే సమయంలో వారు ఎలా ఉంటున్నారు..? ఆఫీసు మాదిరిగానే సీరియస్గా ఉన్నారా..? లేదంటే పనితోపాటు ఇంకేమైనా చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతోన్నాయి. అయితే దీనికి సంబంధించి మీమ్స్ కూడా తెగ ట్రోల్ అవుతోన్నాయి.
మీమ్స్ సందడి..
కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేయాలని కోరడంతో ఉద్యోగులంతా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అయితే ఆఫీసుకు వెళ్లినట్టు టిక్ టాక్గా తయారవడం లేదని తెలుస్తోంది. ఇంట్లో ఉన్న మాదిరిగానే లుంగీ కట్టుకొని, బనీయన్ వేసుకొని జనరల్గా ఉంటున్నారని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. పక్కనే ల్యాప్ట్యాప్ పెట్టుకొని.. మొహానికి మాస్క్ పెట్టుకొని వంట చేస్తోన్న ఫోటో కూడా కనిపిస్తోంది. దీంతో వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లో ఉండి పనిచేయడమే కాదు.. ఇంటి పని కూడా చేస్తున్నారని అర్థం వచ్చేలా కామెంట్లు వస్తున్నాయి.
పైకి మాత్రం ఇలా..
వైరస్ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేయడంతో.. సీరియస్ నెస్ తగ్గడంతో తమకు ఎక్కడ నష్టాలు వస్తాయెమోనని కంపెనీలు బయటపడుతున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం బేఫికర్గా పెళ్లాం, పిల్లలతో జాలీగా పనిచేస్తున్నారు. వైరస్ పుణ్యాన ఇంటిపట్టున ఉంటూనే.. పనిచేసుకొనే వెసులుబాటు దక్కిందని లోలోన సంబరపడిపోతున్నారు. పైకి మాత్రం ఎప్పుడూ కరెంట్ పోతుందో తెలియదని, ఇంటర్నెట్ సమస్య అని కాకమ్మ కబుర్లు చెబుతున్నారని తెలుస్తోంది.
Recommended Video
కామెంట్లు..
మరోవైపు ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకి సంబంధించి మీమ్స్ కూడా తెగ సందడి చేస్తున్నాయి. ఆఫీసులో ఉండే మాదిరిగా కాకుండా.. ఇంట్లో ఉండేలా ఉన్న ఫోటోలు కూడా తెగ ట్రోల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కూడా పెడుతున్నారు. వర్క్ ఫ్రం హోం అంటే ఇదేనని కొందరు, ఇంట్లో పనితోపాటు ఆఫీసు వర్క్ ఒత్తిడి అని రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.