జెట్ ఎయిర్వేస్కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్
ముంబయి : జెట్ ఎయిర్వేస్కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడున్నర నెలల నుంచి జీతాలు లేవంటూ.. విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు పైలట్లు. సోమవారం (15.04.2019) ఉదయం 10 గంటల నుంచి నో డ్యూటీ అంటున్నారు సదరు 1100 మంది పైలట్లు. ఈ సంస్థలో 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పైలట్లు విధులకు దూరంగా ఉంటామని ప్రకటించడం జెట్ ఎయిర్వేస్కు కష్టాలు తెచ్చిపెట్టనుంది.
ఫుట్బాల్ గ్రౌండంత రెక్కలు!.. 2 లక్షల కిలోల బరువు.. గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం (వీడియో)
ఈ పదకొండు వందల మంది పైలట్లు నేషనల్ ఏవియేటర్ గిల్డ్ సభ్యులు. పైలట్లకే కాదు ఇతర విభాగాల సిబ్బందికి కూడా జీతాలు లేవట. జనవరి నుంచి ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బకాయిలు పెండింగులో ఉన్నాయంటున్నారు పైలట్లు. ఎప్పుడూ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అందుకే విధులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.