వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...

|
Google Oneindia TeluguNews

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు అంతస్తుల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరో 14 మందిని కాపాడినట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని .. విచారణ జరుపుతున్నామని తెలిపారు.

చెలరేగిన మంటలు
ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో శ్యామ్ అయ్యర్ అనే స్థానికుడు చనిపోయాడు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటననే 14 మందిని సురక్షితంగా కాపాడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగి పొగ కమ్ముకొందని .. దీంతో కొందరు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు.

1 killed in fire at 4-storey building near Taj Mahal hotel in south Mumbai; 14 rescued

భవనంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు సంఘటనాస్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకొని .. మంటలను ఆర్పివేశాయి.

English summary
META DESCRIPTIONA fire broke out in a four-storey residential building located behind the iconic Taj Mahal Palace Hotel here on Sunday, leaving one person dead and another seriously injured, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X