Cyclone Amphan: బెంగాల్లో 10 మందికిపైగా మృతి, సీఎం మమత రివ్యూ
కోల్కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆంపన్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 10-12 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. సచివాలయం నుంచే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ఆమె సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావంతో కోల్కతాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.
amphan cyclone: తీరం దాటిన తుఫాను, బెంగాల్, ఒడిశాల్లో అతలాకుతలం
West Bengal: Streets in Kolkata waterlogged, trees uprooted and houses damaged due to strong winds and heavy rain as #Amphan crossed West Bengal-Bangladesh coast between Digha (West Bengal) and Hatiya Islands (Bangladesh) across Sunderbans, between 1530 and 1730 hrs today. pic.twitter.com/obYlwiW9TO
— ANI (@ANI) May 20, 2020
బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకిన తుఫాను
బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 4గంటలపాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతియా దీవుల వద్ద ఆంపన్ తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లోని సుమారు 6 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
West Bengal: National Disaster Response Force (NDRF) personnel clear electricity wires and uprooted trees off the road between Digha in East Midnapore district and Odisha border, after #CycloneAmphan made landfall earlier today. pic.twitter.com/xUimNna02k
— ANI (@ANI) May 20, 2020
ఈ అంపన్ తుఫాను కారణంగా ఇప్పటికే బెంగాల్, ఒడిశా తీరాలు అతలాకుతలమయ్యాయి. ఆయా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రపు అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అనేక చెట్లు నేలకూలుతున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుఫాను తీరం దాటాక గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇది బంగ్లదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు.