వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైలు: పది మంది మృతి, 30 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

బిజ్నోర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మానవరహిత రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాక్టర్‌ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ట్రాక్టర్ వ్యాగన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ సమీపంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సంభవించింది.

 10 killed, 30 injured in train collision in Uttar Pradesh

వ్యాగన్‌లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారంతా గంగానది సమీపంలోని ఓ పవిత్ర స్థలానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మీరట్‌లోని ఆస్పత్రిలో క్షతగాత్రులను చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానవరహిత లెవెల్ క్రాసింగ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.

English summary
A train rammed into a tractor pulling a wagon loaded with people at an unmanned railroad crossing in Uttar Pradesh, killing 10 people and injuring more than 30 others, a police official said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X