యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతి
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది మృతిచెందారు. ఈ పేలుడు ప్రభావంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఇరుక్కున్న నలుగురి మృతదేహలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, కలియార్ మన్సూరిని షాపు ఓనర్ గా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు.
Bhadohi: 10 people dead after an explosion in a two-storey building. Rescue operations underway. Police say, 'The building was a carpet factory. We have information that fire-crackers were being made here illegally. Investigation is underway'. pic.twitter.com/eCqXEuDir7
— ANI UP (@ANINewsUP) February 23, 2019