చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర ప్రమాదం: 10మంది మృతి, 13మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

తిరుచరాపల్లి: తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి తిరుచ్చి వద్ద బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మద్యంమత్తులో సైనికుడి కాల్పులు

అతిగా మద్యం సేవించిన ఓ సైనికుడు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో ఇరుగుపొరుగువారు నలుగురు చనిపోయారు.

10 killed in road mishap in Tamil Nadu

మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో అతడూ చనిపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

హసన్‌పూర్ వాసి జంగ్‌దీప్‌సింగ్ అనే సైనికుడు సెలవుదినం కావడంతో ఇంట్లోనే ఉండి ఫూటుగా సేవించాడు. పాతకక్షను దృష్టిలో పెట్టుకుని ఇరుగుపొరుగు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో రెండు కుటుంబాల్లోని నలుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

లొంగిపోవాలని చేసిన హెచ్చరికలు పట్టించుకోని సైనికుడి అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడని ఎస్పీ జస్కారంజిత్‌సింగ్ తేజా తెలిపారు. క్షతగాత్రులను లూథియానా ఆస్పత్రి తరలించారు.

English summary
At least 10 persons were killed and 13 injured after a state-run bus rammed into a stationary lorry near here tonight, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X