దారుణం: స్వీట్లు ఆశగా చూపి.. పదేళ్ల బాలికపై.. మూడు నెలలుగా.. గ్యాంగ్ రేప్
అయిదో తరగతి చదువుతున్న ఆ బాలిక(10)పై.. వాచ్మన్గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్ (60), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్ పన్వాల్ (42), గ్యానేంద్ర పండిట్ (34),
భోపాల్: భోపాల్ నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే అదే నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికకు స్వీట్లు ఆశగా చూపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా అనేకమార్లు ఆ బాలికపై అత్యాచారం జరపడమేకాక.. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ వరుస అత్యాచార ఘటనలతో భోపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే... అయిదో తరగతి చదువుతున్న ఆ బాలిక(10)పై.. వాచ్మన్గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్ (60), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్ పన్వాల్ (42), గ్యానేంద్ర పండిట్ (34), సుమన్పాండే (49) గత 3 నెలలుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు.
చివరిసారిగా ఆ బాలికపై నిందితులు నవంబర్ 12న అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే సుమన్ పాండే స్వీట్లను ఆశగా చూపి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. దీంతో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.