100కోట్ల ఆస్తిని, కూతుర్ని వదిలేసి సన్యాసం: యువ జంట సంచలనం
చాలా మంది విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ జీవితాలను మెరుగురుపర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. మరికొందరు అడ్డదారులు వెతుకుతారు.
భోపాల్: చాలా మంది విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ జీవితాలను మెరుగురుపర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. మరికొందరు అడ్డదారులు వెతుకుతారు. సన్మార్గంలో వెళితే మంచి.. చెడ్డ మార్గాన వెళితే చెడు ఫలితాన్ని అనుభవిస్తారు.
ఊహించని నిర్ణయం
కానీ, ఇక్కడ ఓ జంట మాత్రం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు ఆ దంపతులు. తమ కూతురును కూడా వదులుకుంటున్నారు.
వందకోట్ల ఆస్తి, మూడేళ్ల కూతురును కూడా..
మధ్యప్రదేశ్లోని నీమచ్ పట్టణానికి చెందిన సుమిత్, అనామికా దంపతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ మూడేళ్ల కుమార్తె సహా రూ.100కోట్ల కుపైగా ఆస్తిని తృణప్రాయంగా వదులుకుని సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.
ఉన్నత విద్యావంతులే.. 23న ముహూర్తం
ఆ జంట ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం. సుమిత్ కు వారసత్వంగా వచ్చిన పెద్ద వ్యాపారం కూడా ఉంది. వీటన్నింటినీ వదులుకుని సెప్టెంబర్ 23న సూరత్లో జరగనున్న కార్యక్రమంలో ఈ దంపతులు జైన సన్యాసులుగా మారనున్నారు.
అనామిక తండ్రి బీజేపీ అధ్యక్షుడిగా..
కాగా, అనామిక తండ్రి చిత్తోడ్ గఢ్ బీజేపీ అధ్యక్షులుగా గతంలో పనిచేశారు. ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసింది. మొదట ఉద్యోగం చేసిన అనామిక.. ఆ తర్వాత కుటుంబం కోసం గృహిణిగా మారిపోయింది.