103కు చేరిన పిల్లల మరణాలు...
బీహార్లోని మెదడు వాపు వ్యాధితో మరో ఆరుగురు చిన్నారులు ముజఫర్ జిల్లాలో సోమవారం మృత్యువాత పడ్డారు.దీంతో ఈ వ్యాధిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 103కు చేరింది. కాగా చనిపోతున్న చిన్నారులంతా 10 సంవత్సరాల లోపు వారే అయి ఉండడం ఆందోళన కల్గిస్తోంది. కాగా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సైతం బీహార్లోని శ్రీ క్రిష్ణ మెడికల్ కళాశాలను సందర్శించారు.
ఇక గత వారం రోజుల క్రితం ప్రారంభమైన మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పిల్లలకు ముఖ్యంగా జ్వరంతోపాటు ,లో లెవల్ బ్లడ్ షుగర్, మరియు విపరీతమైన హ్యూమిడిటితో బాధపడుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే అక్కడి మరణాలపై మానవ హక్కుల సైతం స్పందించి, కేంద్ర రాష్ట్ర్ర , ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రోజురోజుకు పెరుగుతున్న మరణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇక మరోవైపు మరణించిన కుటుంభాలకు నితీష్ కుమార్ ప్రభుత్వం నాలుగు లక్షల రుపాయలను ప్రకటించింది. దీంతోపాటు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా...మృతుల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళనలు కల్గిస్తున్నాయి.