10 రోజులే: 10వ తరగతి పరీక్షలపై కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ మిగిలిన పదవ తరగతి పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈశాన్య ఢిల్లీకి చెందని విద్యార్థులు మినహా దేశ వ్యాప్తంగా ఎలాంటి 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడవని తెలిపింది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అందరూ విద్యార్థులకు 10 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇంతకుముందు మాట్లాడుతూ.. ఒకటి లేదా రెండ్రోజుల్లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వెబినార్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
📢Attention class X students!
— Ministry of HRD (@HRDMinistry) May 5, 2020
No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi.
An adequate time of 10 days will be given to all students for the preparation of exams.#EducationMinisterGoesLive pic.twitter.com/x4QJAInvtT
జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు భారీ సంఖ్యలో సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించడం జరుగుతుందని చెప్పారు.
దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్) పరీక్షలను జులై 18 నుంచి 23 మధ్య, మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షలను జులై 26న నిర్వహించడం జరుగుతుంది.