భారత్లో కనిపించే ఈ జాతి జంతువులే నిపా వైరస్కు మూలకారణం: పరిశోధకులు
నిపా వైరస్... ప్రమాదకరమైన వైరస్. గతేడాది ఒక్క కేరళలోనే 17 మంది ప్రాణాలు తీసిన అతిప్రమాదకరమైన వైరస్. ప్రస్తుతం మళ్లీ కోరలు చాచేందుకు సిద్ధమవుతోంది. భారత్లో గబ్బిలం జాతికి చెందిన 11 జంతువులు నిపా వైరస్ను వ్యాప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశోధకులు తమ ప్రాథమిక పరీక్షల ద్వారా వెల్లడించారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ బ్యాట్కు నిపా వైరస్ సోకిందని అది పండ్లను కొరికినప్పుడు ఆ వైరస్ అందులోకి ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
గబ్బిలం జాతికి చెందిన 113 జంతువుల్లో 31 జంతువుల శాంపిల్స్ను పరీక్షించడం జరిగింది. ఇ:దులో 11 జంతువుల్లో నిపా వైరస్ లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో ఫలితాలు 83శాతం అక్యూరసీతో సరిపోలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ జంతువులు ఎలాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయనేదానిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆ ఆహారంను మనుషులు తీసుకుంటే వారికి నిపా వైరస్ సోకి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రైనా ప్లో రైట్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఈ పరీక్షలు అమెరికాలోని మోంటానా స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీకి చెందిన పీఓ నమీర్ కూడా ఉన్నారు.