వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోయలో పడిన బస్సు: 11మంది మృతి, 19మందికి గాయాలు
ఐజ్వాల్: మిజోరాం రాష్ట్రంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంగ్జ్వాల్ గ్రామ సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయాలపాలయ్యారు.
పర్వత వాలులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్కు వెళ్తోందని పోలీసులు తెలిపారు.
గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, లుంగ్లీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 10మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలున్నారు.
Comments
English summary
At least 11 people, including six women, were killed and 19 injured when the bus they were travelling in fell into a 500-metre-deep gorge in Mizoram's Lunglei district today, police said.
Story first published: Tuesday, June 5, 2018, 19:39 [IST]