వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైవేపై ఢీకొన్న రెండు బస్సులు: 11 మంది మృతి, 20మందికి గాయాలు
ముంబై: ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాల్ఘర్ జిల్లాలోని అచ్ఛాద్ గ్రామ సమీపంలో ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వాపిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
11మంది మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ ఐదేళ్ల పాప ఉన్నారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను తాలసరి గ్రామీణ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మినీ బస్సులోని డ్రైవర్ నిద్రించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
Comments
English summary
At least 11 people, including five-year-old were killed and 20 others injured after a mini-bus going towards Surat crashed into a luxury bus on early Monday morning.
Story first published: Monday, May 25, 2015, 12:17 [IST]