వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి, చెల్లాచెదురుగా మృతదేహాలు

కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. చిత్ర దుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొంది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. చిత్ర దుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొంది.

ఘటనా స్థలంలోనే 11 మంది కూలీలు మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడివున్నాయి. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

11 killed in a Road accident in Karnataka

వేగంగా వస్తున్న లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను రాంపూర ఆస్పత్రిలో ఉంచినట్లు చెప్పారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
11 persons killed and seven injured in a Road accident occurred in Karnataka on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X