వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోధ్‌పూర్‌లో రెండు లారీ ఢీ: 11మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజస్ధాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రహదారిపై వెళుతున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వారిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

11 people dead in lorry accident at jodhpur

మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జోధ్ పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

English summary
11 people dead in lorry accident at jodhpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X