118 రోజుల్లో జైల్లో శశికళను కలిసింది ఎంత మంది అంటే ? జైలు పోయెస్ గార్డెన్ చేశారు !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను చూడటానికి భారీ సంఖ్యలో బంధువులు, పార్టీ నేతలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారని వెలుగు చూసింది.
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను చూడటానికి భారీ సంఖ్యలో బంధువులు, పార్టీ నేతలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారని వెలుగు చూసింది. జైళ్ల శాఖ నియమాలు ఉల్లంఘించి శశికళను కలిశారని వెలుగు చూసింది.
సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ వేసుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని హల్ చల్, ఈ వీడియోలో !
అక్రమాస్తుల కేసులో శిక్షపడటంతో 118 రోజుల క్రితం శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి జైల్లో శశికళను కలవడానికి ఆమె బంధువులు, అన్నాడీఎంకే పార్టీలోని ఆమె వర్గం నాయకులు వెళ్లారు.
ఇప్పటి వరకూ శశికళ కేవలం 28 మంది మాత్రమే ఆమె బంధవులు, పార్టీ నేతలు వచ్చారని జైలు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే జైల్లో శశికళను 32 సార్లలో 82 మంది ఆమె బంధవులు, అన్నాడీఎంకే పార్టీ నేతలు కలిశారని విచారణలో వెలుగు చూసింది.
సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, ఫోటోలు లీక్, ఐదు గదుల్లో మొత్తం, దీన్ని జైలు అంటారా ?
చివరికి శశికళ కోసం జైళ్ల శాఖ నియమాలను గాలికి వదిలేసిన అధికారులు చిన్నమ్మ కోసం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును పోయెస్ గార్డెన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద చిన్నమ్మ శశికళ కర్మకాండ గురించి రోజుకో విషయం బయటకు వస్తున్నది.