వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం, 150 అడుగుల లోయలో పడిన బస్సు: 12 మంది మృతి

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 12 మంది వరకు మృతి చెందారు. మరో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర కాశీ - యమునోత్రి హైవేలో చోటు చేసుకుంది. ఓ బస్సు150 అడుగుల లోయలో పడింది.

విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

12 killed, 13 hurt as bus falls down 150 metre gorge in Uttarakhand

అది ఓ ప్రయివేటు బస్సు అని, వికాస్‌ నగర్‌ నుంచి జంకిచట్టికి వెళ్తోందని, మధ్యలో దంతా వద్ద లోయలో పడిందని ఉత్తరకాశి జిల్లా మెజిస్ట్రేట్‌ అశిష్‌ చైహాన్‌ చెప్పారు.

ప్రమాదం కారణంగా పదిమంది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని చెప్పారు. ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హెలికాప్టర్‌లో డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

English summary
At least 12 people were killed while 13 injured after a bus they were travelling in fell into a gorge near Damta on Uttarkashi-Yaumotri Highway on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X