నిర్బయ తరహాలో గ్యాంగ్ రేప్, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బాలిక మీద దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆమెను కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్లి నిర్జనప్రదేశంలో విసిరివేసి పరారైనారు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 12 సంవత్సరాల దళిత బాలిక నివాసం ఉంటున్నది. శుక్రవారం బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత బాలిక గ్యాంగ్ రేప్ విషయం బయటకు చెబుతుందని భయపడ్డారు.
బాలిక సున్నితమైన భాగాలలో చెక్కలు పెట్టి దారుణంగా హింసించి హత్య చేశారు. మృతదేహాన్ని విసిరివేసి పరారైనారు. స్థానికులు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక శవాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ నిర్బయ తరహాలోనే బాలిక హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు చెప్పారు. బాలిక సున్నితమైన భాగాల్లో చెక్కలు పెట్టి కొట్టడం వలనే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.