వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

430కిలోల బంగారం,12లక్షల కొత్త నోట్లు: ఐటీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా దాడుల్లో ఏకంగా రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన అన్ని దాడుల కన్నా తాజాగా నోయిడాలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో బంగారంతో పాటు నగదు పట్టుబడింది.

శ్రీ లాల్ మహల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లక్నో విభాగం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

120 Crores In Gold, 12 Lakhs In New Notes Found In Raid On Delhi Firm

భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు:

తాజా దాడుల్లో ఏకంగా రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్దతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా కూడబెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇదే కంపెనీ నుంచి భారీ మొత్తంలో ఆన్ లైన్ నగదు లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ.. అధికారుల ప్రశ్నలను కంపెనీ డైరెక్టర్లు దాటవేస్తున్నారని ఐటీ అధికారులు చెబుతున్నారు.

English summary
Revenue officials from Lucknow have seized 430 kg of gold, worth around Rs. 120 crore, after raids on a company in Delhi and Noida. Rs. 2.48 crore in old notes, Rs. 12 lakh in new notes, 80 kg of silver and 15 kg of gold jewellery were also found in the raids, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X