గుజరాత్ లో ఓటు వేసిన 127 ఏళ్ల వృద్దురాలు, ఎంత హోరాహోరీ అంటే ఇదే!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వర్గాలకు చెందిన వారి ఒక్క ఓటు కూడా వృదా కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఓటు వృదా అయినా ఫలితం వేరుగా ఉంటుందని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు.
షాక్: హార్దిక్ పటేల్ మరో రాసలీలల సీడీ విడుదల, వైరల్, దెబ్బకు కాంగ్రెస్ పార్టీ లీడర్స్!
గుజరాత్ లో శనివారం భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాజ్ కోట్ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న అజిబ (126) అనే వృద్దురాలు కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇద్దరు సహాయం లేనిదే అజిబ నిలబడలేరు. అలాంటి పరిస్థితుల్లో 126 ఏళ్ల అజిబ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రం చేరుకుని ఓటు వేశారు. 126 ఏళ్ల వృద్దురాలు అజిబ ఓటు వేసిన సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఎంత హోరాహోరిగా జరుగుతున్నాయో అజిబ ఓటు విలువ చెబుతోందని స్థానిక ప్రజలు అంటున్నారు.