విషాదం : ఫుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 15 మంది మృతి
గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూరత్లోని కోసాంబ ప్రాంతంలో ఓ ట్రక్కు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో... దానిపై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(జనవరి 18) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతులంతా కూలీలు అని... రాజస్తాన్లోని బాన్స్వాడా జిల్లా నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్రమాద సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారని చెప్పారు. మొదట ఆ ట్రక్కు చెరుకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిందని... దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లాడని చెప్పారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
— ANI (@ANI) January 19, 2021
Police says, "All the deceased are labourers and they hail from Rajasthan." pic.twitter.com/E9uwZnrgeO