పుట్టినరోజు పార్టీకి వెళ్తే, మత్తుమందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు
పుట్టినరోజు పార్టీలో స్నేహితురాలికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తోటి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన డిసెంబర్ 13వ, తేదిన చోటుచేసుకొంది. నిందితుల్లో మైనర్ కూడ ఉన్నాడు.
న్యూఢిల్లీ :పుట్టినరోజు వేడుకలకు స్నేహితులందరితో కలిసి ఎంజాయి చేసేందుకు వచ్చారు. అయితే పుట్టినరోజుల వేడుకల్లోనే స్నేహితురాలిపై ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఓ మైనర్ కూడ ఉన్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ డిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఈనెల 13వ, తేదిన బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి మైనర్ బాలిక హజరైంది. ఆమె స్నేహితులు కూడ ఈ పార్టీకి వచ్చారు. మైనర్ బాలికపై అత్యాచారం చేయాలని తోటి స్నేహితులు పథకం వేశారు.
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారు
పుట్టినరోజు పార్టీ సందర్భంగా మైనర్ బాలికకు ఇచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందుకలిపారు. ఆ కూల్ డ్రింక్ తాగిన ఆమె స్పృహకోల్పోయారు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే తోటి స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఆమెపై అత్యాచారం చేసి పుట్టినరోజు పార్టీ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్ళిపోయారు.
అయితే స్థానికులు ఆమెను చూసి ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడ ఉన్నాడు. నిందితుల్లో సాహిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. మిగిలినవారి కోసం వెతుకుతున్నారు.