13 ఏళ్ల బాలికపై 9 మంది: 5 రోజుల్లో 2 సార్లు రేప్.. ట్రక్ డ్రైవర్లు కూడా..
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం సన్మాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని ఉద్దేశం మహిళలపై జరుగుతోన్న దాడులను వివరించడమే.. సరిగ్గా ఆ సమయంలో బాలికపై లైంగికదాడి జరగడం కలకలం రేపింది.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
లైంగికదాడులు
గత ఆరు రోజుల నుంచి మధ్యప్రదేశ్లో వివిధ చోట్ల ఇలాంటి లైంగికదాడులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 4వ తేదీన తెలిసిన వ్యక్తి 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. అలా అతని ఫ్రెండ్స్ రెండురోజులు లైంగికదాడి చేశారు. జనవరి 5వ తేదీన ఆమెను వదిలేశారు. అయితే జరిగిన ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో బాలిక భయపడిపోయింది. ఎవరికీ చెప్పలేదు.
మరోసారి కిడ్నాప్
జనవరి 11వ తేదీన మరోసారి కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. రోడ్డుపై వదిలేసి వెల్లగా.. అక్కడ ఉన్న ముగ్గురు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. వారిలో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. వారి కబంధ హస్తాల నుంచి బాలిక శుక్రవారం ఉదయం తప్పించుకుంది. అప్పుడే జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేప్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహిళపై లైంగికదాడి.. ఐదుగురి అరెస్ట్
మధ్యప్రదేశ్లో లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. గత నెల 9వ తేదీన 48 ఏళ్ల వయస్సు గల మహిళపై సిద్ది జిల్లాలో లైంగికదాడి చేశారు. ఐదుగురు కలిసి దారుణానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు ఆమె ప్రైవట్ పార్టుల్లోకి రాడ్ దింపిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 11వ తేదీన ఖాంద్వా జిల్లా 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కాగా.. రేప్ చేసి హత్య చేశారు.