కరోనా:హజూర్ సాహిబ్ టు పంజాబ్, 55 మంది యాత్రికులకు పాజిటివ్ రావడంతో అలర్ట్...
మహారాష్ట్రలోని నాందేడ్లో గల హజూర్ సాహిబ్కు పంజాబ్ నుంచి భక్తులు వచ్చారు. అయితే వారు తిరిగి సొంత రాష్ట్రం చేరుకోగా 137 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో శుక్రవారం వరకు 55 మందికి భక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని పంజాబ్ వైద్యారోగ్యశాఖ మంత్రి ఓపీ సోని తెలిపారు. పాజిటివ్ వచ్చిన యాత్రికుల సంఖ్య పెరగొచ్చని చెప్పారు. వారు తమ ఇంటిలో ఉండాలని మంత్రి కోరారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని.. వైద్యులు సూచించిన జాగ్రత్తలను మాత్రం పాటించాలని కోరారు.
కరోనా: 24 గంటల్లో 1755 కొత్త కేసులు.. HCQ ఉత్పత్తి పెంపు.. కేంద్రం తాజా ప్రకటన..
గత 24 గంటల్లో పంజాబ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. హజూర్ సాహిబ్ వచ్చినవారితో కలిపి శుక్రవారం ఒక్కరోజు 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ వచ్చినవారి మొత్తం సంఖ్య 585కి చేరింది. మృతుల సంఖ్య 20కి చేరింది.
దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 35 వేల 365 పై చిలుకు మందికి వైరస్ సోకగా.. 25 వేల 149 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 9 వేల 64 మందికి వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. మృతుల సంఖ్య 1152కి చేరింది.