బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కార్యాలయంలో అధికారులకు గేట్ పాస్, యడియూరప్ప మార్క్ రాజకీయాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తనదైన మార్క్ రాజకీయాలకు నాంధీపలికారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వివిద శాఖల మంత్రుల కార్యాలయాల్లో పని చేస్తున్న 14 మంది రిటైడ్ ఐఏఎస్ అధికారులను విధుల నుంచి తప్పించి ఇంటికి పంపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన సందర్బంలో రిటైడ్ అధికారులను ఆయన కార్యాలయంతో పాటు వివిద శాఖల మంత్రుల కార్యాలయాల్లో విధులు కేటాయించారు. యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన తరువాత 14 మంది రిటైడ్ ఐఏఎస్ అధికారులను విధుల నుంచి తప్పించారు.

14 retired officers relieved from duty in Yeddyurappa govt

సీఎం అధికార నివాసంలో ఉద్యోగం చేస్తున్న కొందరు అధికారులను విధుల నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వివిధ శాఖల మంత్రుల కార్యాలయాల్లో పని చేస్తున్న 23 మంది అధికారులను వారి మాతృశాఖలకు పంపించారు.

అధికారుల మీద దృష్టి పెట్టిన సీఎం యడియూరప్ప ఇప్పటి నుంచి ఆయన మార్క్ పరిపాలన ప్రారంభించారు. రిటైడ్ ఐఏఎస్ అధికారి ఎస్. సుబ్రమణ్య, బీఎస్, కృష్ణయ్య, కే. విశ్వనాథ్ రెడ్డి తదితర ప్రముఖ అధికారులను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఎం. నారాయణప్ప, కేఆర్. శివకుమార్, ఎల్. చెన్నకేశవమూర్తి, ఎంజి. గూళిగౌడ, ఎం.సి. నాగరాజ్ తదితర ప్రభావిత అధికారులను విధుల నుంచి తప్పించారు. యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాల్లో ఇంత కాలం విధులు నిర్వహించిన అధికారులను బదిలి చేశారు.

English summary
14 retired officers who working in Chief Minister and various minister offices relieved from duty after Yediyurappa takes charge as Chief Minister of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X