14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!
చెన్నై/ తిరుపూర్: అక్రమ సంబంధం కారణంగా 14 ఏళ్ల బాలుడి చేతిలో ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. స్నేహితులతో కలిసి ఆడుకునే వయసులో ఆంటీ ఆంటీ అంటూ ఆమె వెంటపడి లైంగిక కోరికలు తీర్చుకుంటున్న బాలుడు నేడు హంతకుడు అయ్యాడు. ముగ్గురు పిల్లల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ బాలుడు నేడు కటకటాలపాలైనాడు. రాత్రి ఆ పని చెయ్యాలని మహిళ ఒత్తిడి చెయ్యడంతో తనకు ఓపిక లేదని చెప్పిన బాలుడు సహనం కోల్పోయి చివరికి ఆమెను దారుణంగా చంపేశాడు. 14 ఏళ్ల బాలుడి అక్రమ సంబంధం, హత్య కేసు నేడు తమిళనాడులో సంచలనం రేపింది.
అమ్మాయిలకు స్పెషల్ క్లాసులు, కంప్యూటర్ టీచర్ అరాచకాలు, ఎక్కువ మార్కులు వేస్తానని 15 మందికి!
బీహార్ దంపతులు
బీహార్ లోని శంబుద్దిమిడిలోని అరాషి కర్షాప్ ప్రాంతానికి చెందిన మిథున్ దాడియా, షీలా దేవి (30) దంపతులకు కోమం కుమార్ (6), సత్యం కుమార్ (4) అనే ఇద్దరు కుమారులతో పాటు తులసి (2) అనే కుమార్తె ఉంది. వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు పుట్టే వరకు మిథున్ దాడియా, షీలా దేవి దంపతులు బీహార్ లోనే సుఖంగా జీవించారు.
ఉద్యోగం కోసం తమిళనాడు
ఉద్యోగం కోసం మిథున్ దాడియా, భార్య షీలా దేవి, కుమారులు, కుమార్తెతో కలిసి తమిళనాడులోని తిరువూర్ చేరుకుని అక్కడి కొంగునూర్ మెయిన్ రోడ్డులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తిరువూర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మిథున్ దాడియా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లే మిథున్ దాడియా రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.
హాయ్ ఆంటీ అంటూ 14 ఏళ్ల బాలుడు
బీహార్ కు చెందిన 14 ఏళ్ల బాలుడు తిరువూర్ చేరుకుని బనియన్లు తయారు చేసే కంపెనీలో పని చేస్తున్నాడు. మిథున్ దాడియా, షీలా దేవి దంపతులకు పరిచయం అయ్యాడు. నిత్యం మిథున్ దాడియా ఇంటికి వెలుతున్న బాలుడు హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అంటూ వారితో చనువుగా ఉంటున్నాడు. మిథున్ దాడియా ఇంటిలో లేని సమయంలో వారి ఇంటికి వెలుతున్న బాలుడు షీలా దేవితో ఎక్కువ చనువు పెంచుకున్నాడు. ఇదే సమయంలో షీలా దేవి బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య
ఓ సారి పనిమీద మిథున్ దాడియా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత మిథున్ దాడియా ఇంటికి వెళ్లిన సమయంలో షీలా దేవి, బాలుడు నగ్నంగా బెడ్ రూంలో రాసలీలలు సాగించడం చూసి షాక్ కు గురైనారు. షీలా దేవి తన ముగ్గురు పిల్లలను వేరే గదిలో పెట్టి వారు బయటకురాకుండా తాళం వేసి ఉన్న విషయం గుర్తించిన మిథున్ దాడియా కోపంతో రగిలిపోయాడు. నీ వయసు ఎంత ? ఆ బాలుడి వయసు ఎంత ? అతనితో నీకు అక్రమ సంబంధం ఏమిటి ? అంటూ భర్త మిథున్ దాడియా భార్య షీలా దేవిని నిలదీశాడు. బాలుడికి బుద్దిమాటలు చెప్పిన మిథున్ దాడియా అతన్ని అక్కడి నుంచి పంపించేశాడు.
బీహార్ వెళ్లిపోయిన భర్త, పిల్లలు
గత సంక్రాంతి పండుగ సందర్బంగా కంపెనీకి సెలవు కావడంతో మిథున్ దాడియా ఇంటిలో ఉన్నాడు. ఆ సయయంలో మిథున్ దాడియా, భార్య షీలా దేవిల మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన మిథున్ దాడియా ముగ్గురు పిల్లలను పిలుచుకుని బీహార్ బయలుదేరాడు. ఆ సమయంలో తాను ఇక్కడే ఉంటానని, బీహార్ మాత్రం రాను అని షీలా దేవి భర్తకు తేల్చిచెప్పింది.
భార్యకు బాలుడితో రోజూ అదే పని!
భర్త మిథున్ దాడియా, పిల్లలు బీహార్ వెళ్లిపోవడంతో షీలా దేవికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. 14 ఏళ్ల బాలుడిని నేరుగా ఇంటికి పిలుచుకుని వచ్చి అతనితో అక్కడే కాపురం పెట్టేసింది. షీలా దేవి బాలుడిని పని చెయ్యడానికి కూడా పంపించకుండా అతనితో కామవాంఛ తీర్చుకోవడం మొదలుపెట్టింది.
స్థానికులకు అనుమానం!
శుక్రవారం షీలా దేవి ఇంటి తలుపులు తీసి ఉండటం, లోపలి నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి వెళ్లి చేశారు. షీలా దేవి గొంతు కోసి హత్య చెయ్యడంతో ఆమె శవమై కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Recommended Video
రాసలీలలకు ఓపిక లేదని చెప్పినా వినలేదు, అందుకే!
ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు షీలా దేవి ఇంటికి వచ్చి వెలుతున్న బాలుడిని తిరువూర్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బాలుడు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. శుక్రవారం షీలా దేవి, బాలుడు విహారయాత్ర (పిక్నిక్) వెళ్లి వచ్చారు. తరువాత ఇంటిలో ఉన్న బాలుడిని తన కామం తీర్చాలని షీలా దేవి రెచ్చగొట్టింది. తనకు చాలా అలసటగా ఉందని, రాసలీలలు సాగించలేనని తాను ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదని, పదేపదే కామంతో తన మీద పడి రెచ్చగొట్టడంతో సహనం కోల్పోయానని, కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి హత్య చేశానని బాలుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. కామవాంఛ తీర్చాలని పదేపదే రెచ్చగొట్టడం వలనే సహనం కోల్పోయిన బాలుడు షీలా దేవిని హత్య చేశాడని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా 14 ఏళ్ల బాలుడు వివాహిత మహిళను దారుణంగా హత్య చేశాడనే విషయం తమిళనాడులో సంచలనం రేపింది.