ప్రేమ, పెళ్లి: పాఠశాల విద్యార్థి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక మృతి!
చెన్నై: ప్రేమించలేదని, పెళ్లికి నిరాకరించిందని రగిలిపోయిన యువకుడు పాఠశాల విద్యార్థిని మీద పెట్రోల్ పోసినిప్పంటించాడు. తీవ్రగాయాలైన బాలిక చికిత్స విఫలమై మంగళవారం మరణించింది. తమిళనాడులోని మదురైలో ఈ దారుణం జరిగింది.
14 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బాలమురుగన్ (23) అనే యువకుడు బాలిక వెంటపడ్డాడు. అయితే బాలమురగన్ ను పెళ్లి చేసువడానికి బాలిక నిరాకరించింది. ఈ విషయంపై బాలమురుగన్ రగలిపోయాడు.
ఫిబ్రవరి 16వ తేదీ బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. బాలిక వెంటపడిన బాలమురుగన్ పెళ్లి చేసుకోవాలని బాలికను వేధించాడు. అయితే బాలిక నిరాకరించడంతో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ బాలిక మీద పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిపోయిన బాలిక మదురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడించింది. బాలమురగన్ ను అరెస్టుట చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.