వ్యానిటీ బ్యాగ్ లో రూ. 3.90 లక్షల రూ. 2 వేల నోట్లు
వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న రూ. 3.90 లక్షలను (రూ. 2,000, రూ.100 నోట్లు) కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా గేట్ దగ్గర పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న రూ. 3.90 లక్షలను (రూ. 2,000, రూ.100 నోట్లు) కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా గేట్ దగ్గర పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరోజ్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్ లో భారీ మొత్తంలో నగదు ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి వ్యానిటీ బ్యాగ్ పరిశీలించారు. ఆ వ్యానిటీ బ్యాగ్ లో ఇటీవలే చలామణిలోకి వచ్చిన రూ. 2,000 నోట్లతో పాటు రూ. 100 నోట్లు దర్శనం ఇచ్చాయి.
ఫిరోజ్ ను విచారించగా అతను సినిమా కథలు చెబుతున్నాడని పోలీసులు అన్నారు. తనకు పరిచయం ఉన్న వారు ఈ వ్యానిటీ బ్యాగ్ ఇచ్చి వెళ్లారని పోలీసులకు చెప్పాడు. బ్యాగ్ లో నిర్మలా అనే మహిళ ఐడీ కార్డు ఉందని. ఫిరోజ్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.
తుమకూరులోని జయనగర లేఔట్ లో పోలీసులు రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి రాఘవేంద్ర, జుబేర్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.