వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 అడుగుల లోయలోకి ప‌ల్టీ కొట్టిన బ‌స్సు!

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్‌: దేవ‌భూమిగా పేరున్న ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ఒక‌టి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 25 మందికి పైగా ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఉత్త‌రాఖండ్‌లోని బ‌ద్రీనాథ్ జాతీయ ర‌హ‌దారిపై సుమారు 25 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు క‌ర్ణ ప్ర‌యాగ‌-కాళేశ్వ‌ర్ మ‌ధ్య అదుపు త‌ప్పింది. ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి రోడ్డు ప‌క్క‌న నిర్మించిన రెయిలింగ్‌ను ఢీ కొట్టి లోయ‌లోకి జారింది. ప‌ల్టీ కొట్టింది.

16 passengers injured in bus accident on Badrinath highway near Kaleshwar in Uttarakhand

ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ స‌హా 25 మంది గాయ‌ప‌డ్డారు. బ‌స్సు ప‌ల్టీ కొట్టిన దృశ్యాన్ని చూసిన వెంట‌నే ఆ మార్గంలో రాక‌పోక‌లు సాగిస్తోన్న వాహ‌న‌దారులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. లోయ నుంచి క్ష‌త‌గాత్రుల‌ను బ‌య‌టికి తీసుకొచ్చారు.

వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హృషికేష్‌-బ‌ద్రీనాథ్ జాతీయ ర‌హ‌దారిపైనే మంగ‌ళ‌వారం మ‌రో ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ఎదురుగా వ‌స్తోన్న ట్యాక్సీని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

English summary
Dehradun: 16 passengers injured after a Bus felt in a gorge near Badrinath Highway in Uttarakhand. A Speedy bus met accident on Badrinath highway near Kaleshwar. Injured passangers admitted to a hospital. After getting the information about this accident police rushed to the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X