ఉగ్రవాదాన్ని వీడని పాక్ .. పీవోకేలో 16 ఉగ్రవాద శిబిరాల శిక్షణ
పాక్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి మొత్తం 16 టెర్రరిస్టు క్యాంప్లు ఉన్నట్టు భద్రతా దళాల ఉన్నతాధికారులు గుర్తించారు. పుల్వామా దాడి జరిగిన తర్వాత కూడ పీవోకే వెంబడీ 16చోట్ల టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు వారు కనుగొన్నారు.పీవోకే వెంబడీ పలు టెర్రరిస్టు గ్రూపులు మళ్లి చురుకుగా తమ కార్యాకలాపాను కొనసాగిస్తున్నాయని ఇండియన్ ఇంటలీజెన్స్ విభాగం హెచ్చరించింది.
పుల్వామాదాడి తర్వాత కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద శిబిరాలకు స్థానిక యువత ఎవరు సహకరించడంలేదని భద్రత దళాల సమాచారం.దీనికి తోడు భద్రతా దళాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులతోపాటు, నాయకత్వాన్ని నిర్యీర్యం చేస్తుందని వారు తెలిపారు. ఈనేపథ్యంలోనే పాక్ శిక్షణ శిబిరాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో తమ కార్యకలాపాలను ఉదృతం చేశాయని చెప్పారు .ఈనేపథ్యంలోనే పీవోకే వెంట పాకిస్థాన్ ఆర్మీతోపాటు ఐఎస్ఐ సహకారంతో శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరిగినా వాటిని ఎదుర్కోంటామని భద్రతా అధికారులు తెలిపారు.
పుల్వామా దాడుల తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది భారత భద్రతా దళాలు. ఈనేపథ్యంలోనే ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి..పాకిస్థాన్ను ప్రపంచదేశల నడుమ ఒంటరీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే మోడీ ప్రమాణ స్వీకారానికి సైతం పాకిస్థాన్ ప్రధాన మంత్రికి అహ్వానం పంపలేదు.