1340-1173=167.. రైలులో ప్రయాణికుల గల్లంతు, శ్రామిక్ ట్రైన్లో ఘటన..
లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పనిలేకపోవడంతో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అయితే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకొని.. రైళ్లలో ట్రావెల్ చేస్తున్నారు. అలాగే గురువారం సూరత్ నుంచి హరిద్వార్ శ్రామిక్ రైలు వెళ్లింది. కానీ అందులో 167 మంది ప్రయాణికులు ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆ రైలులోని ప్రయాణికులు ఏమయ్యారనే ఆందోళన నెలకొంది.
సూరత్లో ఎక్కిన ప్రయాణికుల సంఖ్య, హరిద్వార్లో దిగే సంఖ్యతో సరిపోలలేదని జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు. మే 12వ తేదీన సూరత్ నుంచి 1340 మంది ప్రయాణికులు ప్రత్యేక రైలులో బయల్దేరారు. కానీ హరిద్వార్ స్టేషన్కు 1173 మంది మాత్రమే చేరుకున్నారు.
దీనిపై సంబంధిత సిబ్బందితో వివరాలు సేకరించి.. విచారణ జరిపిస్తున్నామని అధికారులు తెలిపారు. సూరత్ నుంచి రైలు బయల్దేరాక.. ఎక్కడ ఆగలేదని.. ఎవరినీ ఎక్కించుకోలేమని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడిపిస్తోన్న సంగతి తెలిసిందే.