దారుణం: బోర్డింగ్ స్కూలులో విద్యార్థినిపై అత్యాచారం
Recommended Video
డెహ్రాడూన్ : డెహ్రడూన్ బోర్డింగ్ స్కూల్లో 16ఏళ్ల అమ్మాయిపై ఆమె క్లాస్మేట్స్ నలుగురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఆగష్టు 14న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత కురేతికి ఫిర్యాదు అందడం ఆమె వెంటనే విచారణకు ఆదేశించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులకు 17 ఏళ్ల వయసుంటుందని వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం బయటకు పొక్కకుండా రుజువులను ధ్వంసం చేసినందుకు గాను... స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన భార్య, హాస్టల్ వార్డన్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా... స్కూలు సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదువుల సరస్వతిపై కామాంధుల కాటు
ఆగష్టు 14 అమ్మాయిపై అత్యాచారం జరిగింది. అదే స్కూల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులు అమ్మాయిపై అత్యాచారం చేశారని నివేదిత కురేతి తెలిపారు. విచారణ సందర్భంగా జరిగిన ఘటన వాస్తవమేనని తెలియడంతో ఇందుకు బాధ్యులైన అందరినీ అరెస్టు చేసినట్లు పోలీస్ బాస్ చెప్పారు. ఈ కేసును విచారణ చేసిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నరేష్ రాథోడ్...జరిగిన ఘటన గురించి స్కూలు యాజమాన్యం, సిబ్బందికి తెలుసునని అయితే స్కూలు పరువు పోకుండా రుజువులను ధ్వంసం చేసి జాగ్రత్త పడ్డారని నరేష్ రాథోడ్ తెలిపారు. అమ్మాయిని మెడికల్ టెస్టుల కోసం హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. రిపోర్టులు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని నరేష్ రాథోడ్ చెప్పారు. అమ్మాయి బయటి రాష్ట్రానికి చెందిన విద్యార్థిని అని చెప్పిన నరేష్ రాథోడ్.. నలుగురు నిందితులను జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.